కోరుకొల్లు జనసేన సేవాసైన్యం అధ్వర్యంలో కార్యకర్తల సమావేశం

    ఏలూరు ( జనస్వరం ) :  కొరుకొల్లులో జనసైనికులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన భవిష్యత్ కార్యాచరణ, పార్టీని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే అంశాల మీద చర్చించడం జరిగింది. గత ఎన్నికల్లో జరిగిన అసెంబ్లీ మరియు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సేవాసైన్యం చేసిన పనులు దాని వలన వచ్చిన ఫలితం గురించి చర్చించారు. ఎన్నికల కోసం జనసేన సేవాసైన్యం టీమ్ చేసిన సేవా కార్యక్రమాలు మీటింగ్ లో చర్చకు రావడం జరిగింది. రాబోవు ఎన్నికల్లో జనసేన సేవాసైన్యం పాత్ర, విజయం కోసం జనసైనికులు ఎలా కృషి చేయాలి అనే అంశాలపై చర్చిండం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  భూకబ్జా, భూదందా కోరు కోవూరు వైసీపీ ఎమ్మెల్యే : నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్