
మానవ హక్కుల రక్షణ, లంచంను హరికట్టడం, వినియోగదారుడు మోసపోకుండా ఉండేందుకు ఒక మంచి సంస్థ అదే గ్లోబల్ హ్యూమన్ రైట్స్,యాంటీ కార్ప్షన్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ – జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చక్రవర్తి.
కడప,జూన్ 24( జనస్వరం)
భారత్ దేశం ఇతర దేశాలతో పోలిస్తే చాలా వెనకపడ్డ మాటవాస్తవం, ఎందుకంటే ఎవరి విధులు వారు నిర్వహిస్తే ఈరోజు మనం ముందు వరసలో ఉంటాము. ముఖ్యంగా వెనక పడ్డటానికి కారణం మానవ హక్కులకురక్షణ లేక పోవడం,విపరీతంగా లంచం, వినియోగ దారుడు మోసపోవడం, ఇవి ముఖ్య కారణం వల్ల మన దేశంలో ఎవడు ఏమి చేస్తాడు నేను ఏది చేసినా చెల్లుతుంది అనే ధైర్యం, దీనికి తోడు తప్ప చేసిన వాడికి రాజకీయ నాయకుల సపోర్ట్ కారణంగా వెనక పడ్డది.ప్రతి ఒక్కరికీ బాధ్యత,హుందా తనం,క్రమశిక్షణ ఉండాలి అనే ఉద్దేశంతో కడప జిల్లా కు చెందిన అడ్వకేట్ డా.చక్రవర్తి ఒక మంచి ఉద్దేశంతో ఈ సంస్థ ను రిజిస్ట్రేషన్ చేయించి రిటైర్డ్ పోలీసు అధికారులు,అలగే జడ్జిలను, జర్నలిస్టులను,చేర్పించి కొంత వరకు మనం న్యాయం చేయాలని ఈ సంస్థను ఏర్పాటు చెయ్యడం జరిగింది.ప్రస్తుతం సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఒకప్పుడు ఏమి లేని దేశాలు,ఈరోజు మనకంటే ముందు ఉన్న మాట వాస్తవం.ప్రతి ఒక్కదానికి రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్ర ప్రభుత్వంఅనేది కాదు,మనం ఏమి చేయాలో అది చేస్తే చాలు .








