ఉద్యోగులను పూర్తిగా మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ! అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి

ఎయిడెడ్‌

  అనంతపురం, (జనస్వరం) : ప్రభుత్వ ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ ఒప్పందఉద్యోగుల్ని వైసీపీ ప్రభుత్వం నిలువునా ముంచేసిందని.. సీపీఎస్ అంటే ఏంటో ముఖ్యమంత్రికి కాకముందు తెలియదనే పేర్కొనడం హాస్యాస్పదమని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి విమర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడు విధివిధానాలకి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విధి విధానాలకి తేడా ఏమి కనబడడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పట్ల ఇద్దరూ ఒకే విధంగా నడుచుకుంటున్నారని హామీలు ఇవ్వడం, మోసం చేయడం ఈ రెండు పార్టీల విధానమని స్పష్టం అయింది అన్నారు. ప్రభుత్వాన్ని నడిపించే ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చేందుకు ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారులకు మాత్రం అప్పనంగా లక్షలకు లక్షలు దారపోయటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించాలని వారికి హక్కుగా ఉన్న పీఆర్సీ విషయంలో అన్యాయం చేస్తే సహించే ప్రసక్తి లేదన్నారు. తాను అధికారంలోకి వస్తే వారంలోపే సీపీఎస్ రద్దుచేస్తానని నమ్మబలికిన ముఖ్యమంత్రి సీపీఎస్ ఉద్యోగులకు సమాధానం చెప్పాలని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి డిమాండ్ చేశారు.

See also  తిరుమలమ్మపాలెం గ్రామ వంతెనను పరిశీలించిన జనసేన నాయకులు