బాలికలపై మరియు మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన శిక్షలు అమలు చేయాలి : జనసేన వీర మహిళ కాటం అశ్విని

జనసేన

         విజయనగరం ( జనస్వరం ) : బాలికలపైన మరియు మహిళలు పైన అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే కఠినమైనశిక్షలు అమలు చేయాలని వియజనగరం జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి కాటం అశ్వని డిమాండ్ చేసారు. ఈమధ్యనే విశాఖ జిల్లా ఆగనంపూడిలో అత్యాచారానికి గురై మృతిచెందిన.. విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం, పి.కె.పాలవలస గ్రామస్తురాలు, పదమూడు సంవత్సరాల చిరంజీవి పాండ్రంకి కీర్తన స్వగ్రామంలో కుటుంబ సభ్యులను జనసేన పార్టీ తరుపున సంఘీభావం తెలిపేందుకు కలిసారు. ఈ సందర్భంగా ఆమె బాధిత కుటుంబాన్ని కలసి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభంశుభం తెలియని పసికందులను, మహిళలపై కొందరు కామాంధుల చేతుల్లో బలైపోతున్నారని, ఇటువంటి ఉన్మాదులకు సరియైన రీతిలో కఠినమైన శిక్షలు అమలుచేసే చట్టాలు ప్రభుత్వం తీసుకురావాలని ఆమె ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తగు న్యాయం చేయాలని, మృతి చెందిన కీర్తన శరీరంపై గాయాలపై సమాధానం పోలీసులు తగు విచారణ జరిపి తెలపాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు పెద్ది వెంకటేష్, నాయుడు, యేసు, చిన్న౦నాయుడు, వినోద్ కుమార్, విజయనగరం నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), ఎర్నాగుల చక్రవర్తి, రవిరాజ్ చౌదరి,హుస్సేన్ ఖాన్, భవాని,తాతంపూడి రామకృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు.

See also  కొల్లాపూర్ నియోజకవర్గం జనసేన పార్టీ కోఆర్డినేటర్ గా భైరపోగు సాంబశివుడు