గుంతలు పడ్డ రోడ్లుకు మరమ్మతులు చేస్తున్న చెట్టుపల్లి గ్రామ జనసైనికులు

     నర్సీపట్నం, (జనస్వరం) : నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పెద్ద బొడ్డేపల్లి నుండి చోడవరం రోడ్డు మార్గంలో చెట్టుపల్లి ఊరికి దగ్గరలో రోడ్డు గుంతలు పడి, ఇప్పటికే ప్రమాదాలు జరిగి కొంతమందికి దెబ్బలు తగలడం జరిగిందని, ఈ పరిస్థితిని చూసి చెట్టుపల్లి జనసేన పార్టీ వారు నర్సీపట్నం జనసేన పార్టీ వారి నాయకుల సహాయ సహకారాలతో రోడ్డు రిపేరు చేయడం జరిగిందని చెట్టుపల్లి జనసైనికులు తెలియజేశారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఇది వరకు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు రోడ్లు బాగు చెయ్యకపోతే మేమే చేస్తాం అన్న మాట ప్రకారం ఈరోజు మా గ్రామంలో మా అధినేత అక్టోబర్ రెండవ తారీకున చేస్తున్నప్పటికీ ముందుగానే చేయటం, సహాయం చేయడంలో జనసేన పార్టీ ముందుంటుంది  అని చెట్టుపల్లి జనసైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెట్టుపల్లి జనసైనికులు పాల్గొనడం జరిగింది.

See also  రొద్దం మండలంలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ