ఏలూరు నియోజకవర్గములో టీడీపీ నుంచి జనసేన పార్టీలోకి భారీ చేరికలు

ఏలూరు

        ఏలూరు, (జనస్వరం) : ఏలూరు నియోజకవర్గములో  తెలుగుదేశం పార్టీ నుంచి సుమారు 50 మంది కార్యకర్తలు జనసేనపార్టీ ఏలూరు ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో జనసేనపార్టీ కండువాలు కప్పుకున్నారు. స్థానిక 1వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతలు నచ్చి జనసేన పార్టీ లోకి చేరడం మంచి శుభపరిణామము అని అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఆశయాలు, సిద్దాంతలును ప్రజల్లోకి తీసుకెళ్లి  పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కాశీ నరేష్, మండల అధ్యక్షులు వీరంకి పండు, సిటీ వైడ్ ఫాన్స్ అధ్యక్షులు దోసపర్తి రాజు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.

See also  12 కుటుంబాల త్రాగునీటికి పరిష్కారం కల్పించిన వీరవల్లిపాలెం జనసైనికులు