నర్సీపట్నం మున్సిపాలిటిలో శానిటైజేషన్ చేయించిన జనసేన కౌన్సిలర్ శ్రీమతి అద్దేపల్లి సౌజన్య

               విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ జనసేన కౌన్సిలర్ శ్రీమతి అద్దేపల్లి సౌజన్య గారు, జనసేన టౌన్ ప్రెసిడెంట్ అద్దేపల్లి గణేష్ గారు 9వ వార్డ్ లో ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. భయాందోళనకి గురి కాకుకూడదని వార్డ్ లో ప్రతి ఇంటికి శానిటేషన్ చేయించడం జరుగింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు అని, మాస్కు లు శానిటైజర్ వాడాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. అలాగే వారు మాట్లాడుతూ ఏం సమస్య వచ్చినా పోరాడటానికి జనసేన పార్టీ ముందుంటుందని వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, అలాగే శానిటైజర్ వాడాలని వార్డు ప్రజలకు జనసైనికులు అవగాహన కల్పించారు. 

See also  సమస్యల పరిష్కారానికి జనవాణి : అనంతపురం జిల్లా అధ్యక్షులు TC వరుణ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి