
అత్యవసర సమయంలో మానవత్వంతో రక్తదానం చేసిన జనసైనికులు.
ఈ కరోనా విపత్కర సమయంలో రోగులకి రక్తం అందక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సార్లు రక్తం అందక ప్రాణాలు కోల్పోవడం కూడా చూస్తున్నాం. అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయం లో లాక్ డౌన్ కారణంగా అత్య వసర ఈ పరిస్థితుల్లో వెళ్ళిన వాళ్ళకు రక్తo కొరతగా ఉందని సోషల్ మీడియాలో తెలుసుకొన్న జనసేన మండల నాయకులు శ్రీ తర్ర అయ్యప్ప గారు దిబ్బపాలెం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కరణం రాము గారు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వైద్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో కల్ల చంద్రమోహన్, తర్ర అయ్యప్ప, ప్రసాద్ మరియు దిబ్బపాలెం జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొనడం జరిగింది.









