ప్రమాదవశాత్తూ పూరి గుడిసె దగ్ధం : నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందించిన JSP రెవల్యూషన్ టీం

                 తూర్పు గోదావరి జిల్లా, తుని మండలం డీ పోలవరం గ్రామంకు చెందిన నిరుపేద, ఏటువంటి జీవనాధారం లేని రేపర్తి. లోవ  (37) అనే మహిళ, తన ఇద్దరు పిల్లలు, నివసిస్తున్న పూరి గుడిసెలో ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పుఅంటుకోని, ఇల్లు మొత్తం కాలి బూడిద అయ్యింది. ఏ దిక్కు లేని ఆ ఇంటికి  సహాయం కోసం జనసేన (రెవల్యూషన్ టీం ) JSP Revolution Team మెంబర్స్ కలిసి 3 నెలలకి సరిపడే కిరాణ సరుకులతో పాటు 3000/- నగదు పండగ సందర్భంగా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన టీమ్ కు అభినందనలు తెలిపారు.  ఈ కార్యక్రమం కోసం సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. 

See also  జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త బార అదిప్పకు రూ. 50 వేల ఆర్థిక సహాయం