మరణించిన జనసైనికుడి కుటుంబానికి రూ. 65,000 ఆర్థిక సహాయం

               గత వారం కర్లపాలెం మండలం గణపవరంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన మన జనసైనికుడు అంకిరెడ్డి శేషగిరి గారి మృతికి ప్రగాడ సంతాపాన్ని తెలియచేస్తూ బాపట్ల జనసేన క్రియాశీలక నాయకుల తరపున రూ.15000/- నగదు మరియు కృష్ణ ఇక్కుర్తి గారి ద్వారా USA ప్రవాస జనసైనికులు పంపిన రూ.50000/- చెక్కును బాపట్ల జనసేన పార్టీ తరపున శేషగిరి గారి పెదకర్మ రోజున జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ క్రియాశీలక నాయకులు మరియు కర్లపాలెం మండల క్రియాశీలక నాయకుల చేతుల మీదుగా వారి కుటుంబానికి అందచేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ క్రియాశీలక నాయకులు గుంటుపల్లి తులసి కుమారి గారు, నామన వెంకట శివన్నారాయణ గారు, జనసేన బాపట్ల పట్టణ క్రియాశీలక నాయకులు ఉస ప్రసాద్ గారు, కొట్రా మణికంఠ గారు, డేగల అజయ్ కుమార్ గారు, పసుపులేటి మహేష్ గారు, జనసేన కార్య నిర్వాహక సభ్యులు తోట సాయి కుమార్ గారు, జనసేన కర్లపాలెం మండల క్రియాశీలక నాయకులు జిడుగు మాధురి గారు, చిలకల సురేంద్ర గారు, గణపవరం గ్రామ జనసేన నాయకులు గొట్టిపాటి శ్రీకృష్ణ గారు, దేవి రెడ్డి వెంకట శివ గారు, అంకిరెడ్డి సుధీర్ గారు, అంకిరెడ్డి భీమేశ్వరరావు గారు, జనసేన పిట్టలవానిపాలెం క్రియాశీలక నాయకులు మలిశెట్టి వెంకట గోపి గారు, మరియు నల్లమోతు వారి పాలెం క్రియాశీలక నాయకులు సాయినా రాంబాబు గారు, B వెంకటేష్ గారు, తదితర,జనసైనికులు హాజరు కావడం జరిగినది

See also  వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరిన వినుతా కోట