జాతీయ బీసీ చైతన్య సమితి బళ్లారి జిల్లా అధ్యక్షురాలిగా సుజాత రవిచంద్ర నియామకం

బళ్లారి, మార్చి 4, జనస్వరం : జాతీయ బీసీ చైతన్య సమితి బళ్లారి జిల్లా నూతన అధ్యక్షురాలిగా సుజాత రవిచంద్రను నియమించారు. అలాగే జిల్లా కార్యదర్శి సహా ఇతర మహిళా పదాధికారులను కూడా నియమించారు. నియామక పత్రాలను సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బీసీ రమణ శనివారం పంపిణీ చేశారు. నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న జీ టీవీ సాక్షి కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ రమణ మాట్లాడుతూ, బీసీ సమాజానికి విధానసభ మరియు లోక్‌సభలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సమితి ఆధ్వర్యంలో త్వరలోనే “చలో ఢిల్లీ” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 2027లో జరగనున్న జనగణనలో ఓబీసీ కాలమ్‌ను తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షుడు గిరి యాదవ్, కర్ణాటక ప్రభుత్వ ఐదు గ్యారంటీ పథకాల బళ్లారి జిల్లా అధ్యక్షుడు కె.ఇ. చిదానప్ప, జిల్లా ఇన్‌చార్జ్ ఉప్పర మల్లప్ప, ఓబీసీ నాయకుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సుధా, వనజాక్షి, సుజాత, మమత, విజయలక్ష్మి, రేఖా, ఈరమ్మ, దర్జీ మమత తదితరులు సమితిలో చేరి నియామక పత్రాలు స్వీకరించారు.

See also  రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది : మార్కాపురం సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌