పూసపాటిరేగ మండలానికి సీఫీ ఆక్వాకల్చర్ CSR చేయూత

నెల్లిమర్ల, మార్చి 3, (జనస్వరం) : నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం M/s C P ఆక్వాకల్చర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్య ప్రతినిధులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాల వివరాలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. పూసపాటిరేగ మండలంలోని సి.హెచ్. అగ్రహారం, కనిమెట్ట పంచాయతీల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ మౌలిక సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ 10 సోలార్ వీధి దీపాలు, 4 బ్యాటరీతో పనిచేసే స్ప్రే మిషన్లు, 9 లీటర్ల క్రిమిసంహారకాలు మరియు వెక్టర్ కంట్రోల్ రసాయనాలను పూసపాటిరేగ మండల అభివృద్ధి అధికారికి అందజేస్తున్నట్లు వెల్లడించింది. గ్రామాల్లో వెలుగులు మెరుగుపరచడం, దోమల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ సామగ్రి ఉపయోగపడుతుందని తెలిపారు. సంస్థ సామాజిక బాధ్యతతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అభినందిస్తూ, ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలని ఆకాంక్షించారు. సమావేశం ముగింపులో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

See also  7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు తరలిరండి