
కళ్యాణదుర్గం, జనవరి 02, (జనస్వరం) : 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కళ్యాణదుర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును కళ్యాణదుర్గం జనసేన నాయకులు, వీరమహిళలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో కేక్ కట్ చేయించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే సురేంద్రబాబు సమర్థవంతంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థంగా అందాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు అందరి శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంగరాజు, ఆంజనేయులు, జాకీర్ హుస్సేన్, వీరమహిళలు మమత, కల్పన, టీడీపీ మాజీ కౌన్సిలర్ అమర బిందు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.








