ఘనంగా 100 సంవత్సరాల సి పి ఐ జెండా ఆవిష్కరణ వేడుకలు. పట్టణంలో రెపరెపలాడిన ఎర్ర జెండా,

సత్తెనపల్లి లో ఘనంగా 100 సంవత్సరాల సిపిఐ జెండా ఆవిష్కరణ సంబరాలు, రెపరెపలాడిన ఎర్రజెండా

సత్తెనపల్లి,డిసెంబర్26.(జనస్వరం).

పట్టణంలోని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) కార్యాలయంలో శుక్రవారం కమ్యూనిస్టు నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ కార్యాలయంలో సత్తెనపల్లి నియోజకవర్గ కార్యదర్శి ముసునూరు రమేష్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తల కోలాహలం మధ్య కేకులు కట్ చేసి పండుగ వాతావరణం సృష్టించారు. చెంచు కాలనీలో సత్తెనపల్లి పట్టణ కార్యదర్శి వి. లక్ష్మి చెన్నకేశవరావు, యానాది కాలనీలో ఏఐటీ యుసీ జిల్లా ఉపాధ్యక్షుల కంబాల శ్రీనివాసు, లెనిన్ నగర్ లో నరిసేటి తాండవ కృష్ణ లు పార్టీ జండా లను ఎగర వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ప్రజలకు అండగా నిలబడిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని తెలియజేశారు. కామ్రేడ్ నరిసేటి గురవయ్య ఆధ్వర్యంలో యానాది కాలనీ చెంచు కాలనీ, లెనిన్ నగర్ లలో 300 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టించడ మైనదని నాయకులు వివరించారు. గురవయ్య పోరాట స్ఫూర్తిని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు ముట్టే రాంబాబు, సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆర్ శేషయ్య, పొన్నూరు రోశయ్య , వెంకాయమ్మ, మన్యం నరసింహారావు, ఆవుల వెంకటేశ్వర్లు, జంపని నరసింహారావు, పోతురాజు, ఆవుల ఆనంద్, యువజన సంఘ నాయకులు ఎన్ శ్రీను, ఎన్ హనుమయ్య, కంబాల వెంకయ్య శ్రీహరి, డాక్టర్ సోహెల్, కంబాల ఆనంద్ యువజన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న గాదె వెంకటేశ్వరరావు