పుట్టపర్తి రైతుల సంక్షేమంపై మార్కెట్‌ కమిటీ సమావేశం

పుట్టపర్తి, అక్టోబర్ 18, (జనస్వరం) : కొత్తచెరువు మార్కెట్‌ యార్డ్ ప్రాంగణంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్ పూల శివ ప్రసాద్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. రైతుల సంక్షేమమే ప్రభుత్వ అజెండా అని తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు. మార్కెట్‌ యార్డ్‌లో మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చిస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులు ధాన్యాలను ఉచితంగా నిల్వ చేసుకోవడానికి యార్డ్‌లోని గోదాములను వినియోగించుకోవచ్చని చైర్మన్ తెలిపారు. రైతులకు మెరుగైన సేవలను అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు ప్రేమనాథ్, డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

See also  వైసీపీకి హిందుత్వ వ్యతిరేక ముద్ర