అగ్ని ప్రమాదంలో పూర్తిగా ధగ్నం అయిన కుటుంబాలకు 100 బస్తాల సిమెంట్ మరియు ఆర్థిక సహాయం చేసిన బొలిశెట్టి శ్రీనివాస్

అగ్ని ప్రమాదంలో పూర్తిగా ధగ్నం అయిన కుటుంబాలకు 100 బస్తాల సిమెంట్ మరియు ఆర్థిక సహాయం చేసిన బొలిశెట్టి శ్రీనివాస్

               తాడేపల్లిగూడెం నియోజకవర్గo పెంటపాడు మండలంలో పడమర విప్పర్రు గ్రామంలో నాలుగు ఇళ్ళు లు అగ్నిప్రమాదంలో పూర్తిగా ధగ్నం అయినవ వారి కుటుంబాలకు జనసేన ఇంచార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు రూ.20,000 నగదు మరియు 100 kg లు బియ్యం, దుపట్లు, వస్త్రాలు నిత్యావసర వస్తువులు మరియు 100 సిమెంట్ బస్తాలు ఇవ్వడం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా ఆదుకుంటానని, జనసేన పార్టీ ఆదుకోవడానికి ముందు ఉంటుందని అన్నారు. జనసేనాని స్ఫూర్తితో సేవా దృక్పథంతో నడుస్తున్నాని, అలాగే సేవా కార్యక్రమాలతో ప్రజలకు సహాయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానన్నారు. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేస్తున్న సహాయానికి గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. 

See also  కేవీ చలమయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన గునుకుల కిషోర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి