
కందుకూరు ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేన నాయకులు దేవళ్ళ భాస్కర్ గారి కూతురు పుట్టినరోజు సందర్బంగా చెవురు లోని ప్రభుత్వ పాఠశాలలో స్టేజ్ నిర్మాణం కు తన వంతు సాయంగా నియోజకవర్గ జనసేన నాయకులు దేవళ్ళ భాస్కర్ అందించారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలలో అన్ని వ్యవస్థలు విఫలమైనయని అలాంటి ఈ పరిస్థితుల్లో జనసేన టిడిపి కూటమి విజయానికి అందరూ పాటుపడాలని, అలానే కందుకూరు నియోజకవర్గం లో జనసేన నాయకులు దేవళ్ళ భాస్కర్ గారు వివిధ సేవా కార్యక్రమాలతో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని అన్నారు. అలానే రానున్న రోజుల్లో వారి చేసే సేవా కార్యక్రమాలకు పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేసారు. రానున్న రోజుల్లో కందుకూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో కందుకూరు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, కందుకూరు నియోజకవర్గం జనసేన నాయకులు దేవళ్ళ భాస్కర్ గారు, మరియు జనసేన నాయకులు కొణిదెన శ్రీను, ఇంకొల్లు శ్రీనివాసులు, మూలగిరి శ్రీనివాసులు, తమ్మిశెట్టి ప్రసాద్, చలపతి తదితరులు పాల్గొన్నారు.








