పాలకొండ నియోజకవర్గంలో జనసేన – టీడీపీ ఆత్మీయ సమావేశం

జనసేన

పాలకొండ ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు గర్భాన సత్తిబాబు, జనసేన జిల్లా నాయకులు పెడాడ రామ్మోహన్ పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కర్త నిమ్మల నిబ్రహం, జనసేన నాయకులు కూరంగి నాగేశ్వరరావు, పాలకొండ అయ్యప్ప శేంకర్ హోటల్ నందు జనసేన -తెలుగుదేశం పార్టీల మొదటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. జనసేన-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి భవిష్యత్తు కార్యాచరణ అంశాలపై చర్చించారు. రానున్న రోజుల్లో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎటువంటి అపోహలు లేకుండా కలిసికట్టుగా కష్టపడి పనిచేసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మరియు రాష్ట్ర భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని ఏర్పడ్డ పొత్తు ఆవశ్యకతను నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలని చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నుండి నాలుగు మండలాల అధ్యక్షులు మరియు జనసేన పార్టీలో వివిధ హోదాలలో ఉన్న పెద్దలు, కార్యకర్తలు మరియు పాలకొండ తెలుగుదేశం పార్టీ, మండల అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  పర్చూరులో సభలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం, భరోసా అందించిన జనసేన నాయకులు అనిల్ కుమార్