
మానవత్వం చూపిన జనసైనికుడు మాచర్ల రామకృష్ణ
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని అందురు చూస్తూ ఉండిపోయారు గాని ఏ ఒక్కరు సహాయం చేయకపోవడం చాలా దౌర్భాగ్యం. బహిరంగ ప్రదేశాలలో మాస్కులు లేకుండా తిరిగితే రాని కరోనా ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడటానికి కరోనా అడ్డు వస్తుందా..? ఈ సంఘటన చూసి చలించిన జనసేన నాయకుడు మాచర్ల రామకృష్ణ మానవత్వంతో బాధ్యతగా వెంటనే అంబులెన్సుని పిలిపించి ఆ వ్యక్తిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్యులకు అతని పరిస్థితి వివరించగా వైద్యులు వెంటనే స్పందించి శస్త్ర చికిత్స చేయడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడ్డాడు. ఆ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వాళ్లు పరామర్శించి రావడం జరిగింది. జనసేన నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ దయచేసి సమాజం పట్ల అందరూ తమ వంతు బాధ్యతను నిర్వహించాలని కోరుకుంటున్నాను అన్నారు. పవన్ కళ్యాణ్ స్పూర్తి ద్వారా నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, మీరు కూడా మీ వంతు సహాయంగా మానవత్వంగా ఆపదలో ఆదుకోవాలని కోరారు. స్థానిక ప్రజలు రామకృష్ణకు అభినందనలు తెలిపారు.








