జనసేనపార్టీ నుంచి ఒక్క పిచుక కూడా వైసీపీలో చేరలేదు

జనసేనపార్టీ

        రాజంపేట ( జనస్వరం ) : నిన్నటి రోజు అనంత రాజు పేటలోజనసేన నుంచి వైసీపీ లో చేరిక అని పేపర్ లో ప్రకటనలు ఇచ్చుకున్న వాళ్ళు దమ్ముంటే నిరూపించాలని సీనియర్ జనసేన నాయకులు ముద్దపోలు రామసుబ్బయ విమర్శించారు. వాళ్లకు వాళ్ళే వాళ్ళ కండువాలు కప్పుకుని ఆపార్టీ నుంచి ఈ పార్టీ నుంచి అని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఐనా ఈ నాలుగు సంవత్సరాలలో ఏమి చేశారని మీ పార్టీలోకి చేరతారు అని నిలదీశారు. ఇంకొద్దిరోజుల్లో మీ పార్టీ భజన పరులతో సహా ఖాళీ కావడం తథ్యమని చెప్పారు. ఇలాంటి అవాస్తవ ప్రకటనలను ప్రజలు గమనిస్తున్నారని చిత్తు చిత్తు గా ఓడించడం ఖాయమని తెలిపారు. 

See also  అనంతపురం సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో సమస్యల విలయతాండవం