మానవత్వంతో నిరుపేద వృద్ధురాలకు ఇంటిని నిర్మిస్తున్న కోడూరు జనసైనికులు

మానవత్వంతో నిరుపేద వృద్ధురాలకు ఇంటిని నిర్మిస్తున్న కోడూరు జనసైనికులు

               పాశం సీతమ్మ అనే  ఒక నిరుపేద వృద్ధురాలకు అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు జనసైనికులు ఇంటి నిర్మాణం చేయడానికి తలపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో వృద్ధురాలి పరిస్థితిని తెలుసుకున్న స్థానిక జనసైనికులు, NRI జనసైనికులతో చర్చించి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ వృద్ధురాలితో పాటు ఒక మనువరాలు ఉంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చిన్నపుడే మరణించారు. నాగాయలంక జనసైనికులు బొడ్డు విజయ్ మిత్రబృందం సహకారంతో ఈ వృద్ధురాలుకు ఇంటి నిర్మాణం కోసం జనసేన పార్టీ తరుపున 21వేల రూపాయలు నగదు సీతమ్మ గారికీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకోని అమెరికాలో ఉంటున్న NRI సంధ్య గారు వృద్ధురాలు కుటుంబంకు ఆమె వంతుగా 7500 రూపాయలు ఇవ్వటం జరిగింది. దాతలు సహాయం చేసిన డబ్బులుతో మీడియా మిత్రులు శ్రీనుగారు, రవిశంకర్ గారు పాత పూరిపాక తీయించి దాని స్థానంలో నూతనంగా ఇంటి ప్లాన్ వేయించి పాశం సీతమ్మ గారి మనమురాలుతో భూమి పూజ చేపించి ఇంటి నిర్మాణము కోసం శంకుస్థాపన చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా కోడూరు సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ గారు పాలుగున్నారు. ఈ నిరుపేద వృద్ధురాలు కుటుంబంకు అండగా నిలిచి, సమాజంలో ఇలాంటి మంచి పనికి సహకారం అందించిన దాతలకు ధన్యవాదములు తెలిపారు. 

See also  మరణించిన వ్యక్తికి పాడే మోసే వారు రాకపోవడంతో జనసైనికుడే అండగా నిలిచాడు