రాజంపేటలో పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

రాజంపేట

       రాజంపేట ( జనస్వరం ) : జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి విజయ యాత్ర విజయవంతం అవ్వాలని శ్రీకోదండరామస్వామి వారి ఆశీసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజాసంక్షేమ అభ్యున్నతి కోసం జనసేన ప్రభుత్వ స్థాపనకు ప్రజల దృష్టి మార్చాలని స్వామి వారిని కోరినట్లు తెలిపారు. అలాగే ఉమ్మడి కడపజిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట మండలంలో రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న 98వ రోజు పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో పాల్గొన్న! జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ ప్రజల వద్దకు వెళ్ళి గత,ప్రస్తుత ప్రభుత్వాలు చూశారు.భావితరాల భవిష్యత్తు కోసం జనసేనపార్టీ వైపు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే మన ఆంద్రప్రదేశ్ రాష్ట్రనికి అభివృద్ధి సాధ్యమని ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్తించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, మహిళలు, అభిమానులు, మద్దతు దారులు, స్థానికులు పాల్గొన్నారు.

See also  IIIT ప్రవేశ పరీక్షలో రాష్ట్ర 7 వ ర్యాంకును సాధించిన జ్ఞానేశ్వర్ ను అభినందించిన పెందుర్తి జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి