
కడప జిల్లా చెందిన జనసైనికుని నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కోట్టే వెంకటేశ్వర్లు గారు 10000 ఆర్థిక సహాయం
కడపకు చెందిన గజ్జల సాయి గత కొన్ని సంవత్సరాలుగా జనసేన పార్టీ కోసం పూర్తిస్థాయిలో పని చేస్తున్నాడు. ఐతే ఇటీవల సాయి తండ్రికి కరోనా వచ్చి తగ్గిపోగా అనంతరం గుండెకు సంబంధిత వ్యాధి బయటపడింది. ఈ విషయాన్ని కడప జిల్లా జనసేన పార్టీ నాయకులు తాతంశెట్టి నాగేంద్ర ద్వారా విషయం తెలుసుకున్న నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు కోట్టే వెంకటేశ్వర్లు తీగల చంద్రశేఖర రావులు కడపకు వెళ్లి సాయి తండ్రిని పరామర్శించిన సాయి కుటుంబ సభ్యులకు ధైర్యం చేప్పి ఆపరేషన్ నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ రవిప్రసాద్, మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కోఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్ పాల్గొన్నారు.








