
ఓ సారూ… జర మా రోడ్డును పట్టించుకోండి
శ్రీకాకుళం గులుమూరు నుండి కొత్త పేట వెళ్లే మట్టి రోడ్డు ప్రస్తుతం కురుస్తున్న వానలు వల్ల రోడ్డు మొత్తం అడుగడుగుకీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల్లో నీరు చేరి ప్రయాణికులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా సరే తమ ప్రయాణ ఇక్కట్లు మారడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయం గురించి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దృష్టికి చాలా సార్లు తీసుకెళ్లడం జరిగింది. కాని ఎటువంటి స్పందన లేకపోవడంతో అక్కడ ప్రజలు ఈ విషయాన్ని జనసేన పార్టీ దృష్టికి తీసుకురావటం జరిగింది. జనసేనా పార్టీ మండల నాయకులు ఈ విషయం పై స్పదించి అతి త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పడం జరిగింది. జనసేన మండల నాయకులు కొండాడ.సురేష్, గోళ్ళ.తిరుపతి రావు, యుగంధర్, గోపి, సాయి, రాము తదితరులు ఈ విషయంపై స్పదందిచటం జరిగింది.








