అగ్నిప్రమాదంలో పూరిల్లు దగ్ధమై నిరాశ్రయులైన కుటుంబానికి జనసైనికుల ఆర్థిక సహాయం

అగ్నిప్రమాదం

                విశాఖపట్నం ( జనస్వరం ) :  మండల జనసేన నాయకులు టెడ్డాపు నర్సింగరావు ఆధ్వర్యంలో గంభీరం పంచాయతీ బోయపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పూరిల్లు దగ్ధమై నిరాశ్రయులైన కుటుంబానికి జన సైనికులు అండగా నిలిచి తమ వంతు సహకార అందించారు. బోయపాలెం గ్రామానికి చెందిన పి అచ్చియమ్మ, ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా ఆ కుటు౦బం నిరాశ్రయులు కావడంతో ఆనందపురం జనసేన నాయకులు ఆధ్వర్యంలో ఆ కుటుంబానికీ రూ 14 వేలు నగదు, బియ్యం అందజేశారు ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో లేకపోయినా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్ఫూర్తితో కష్టకాలంలో ఉన్న వారిని తమవంతుగా ఆదుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు మజ్జి శ్రీను (ఎక్స్‌ ఆర్మీ) దుక్క వెంకటరావు, టెడ్లపు నర్సింగరావు, సురేష్‌, సుబ్బు, మీసాల నాగేశ్వరరావు, తమ్మిన అప్పలరాజు, తోమురోతు అప్పలరాజు, ఆకుల శివ, శ్రీకాంత్‌, కళ్యాణ్‌, రెడ్డి, ఇతర జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు.

See also  నీటి సమస్యపై అధికారులకు వినతిపత్రం అందించిన కోడుమూరు నియోజకవర్గ జనసేన నాయకులు