జనసేన పార్టీ నాయకులపై అట్రాసిటీ కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నాం : జనసేన నాయకులు

జనసేన

       విజయనగరం ( జనస్వరం ) : బొగ్గుల దిబ్బ వద్ద నివాసముంటున్న నిరుపేదల ఇళ్ల తొలగింపును నిరసిస్తూ, బాధితుల తరుపున ప్రశ్నించినందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని పై అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని జనసేన పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వెంటనే ఆమెపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ ఇలా తప్పుడు కేసు పెట్టడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంస్కృతి రాజకీయాల్లో శ్రేయస్కరం కాదన్నారు. కేసులకు జనసేన పార్టీ, మా నాయకులు భయపడే ప్రసక్తే లేదన్నారు. న్యాయపరంగా కేసులను ఎదుర్కొంటామన్నారు. జనసేన పార్టీ ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ అని తెలిపారు.

See also  మడకశిర మండల జనసైనికులు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి