అనారోగ్యంతో చనిపోయిన జనసైనికుడి కుటుంబానికి అండగా నిలిచిన తణుకు జనసేన నాయకులు

      తణుకు, (జనస్వరం) : తణుకు నియోజకవర్గ తణుకు మండలం కొమరవరం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో  ఘనసాల వరప్రసాద్ మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని తణుకు నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జీ విడివాడ రామచంద్రరావు పరామర్శించడం జరిగింది. అలాగే వరప్రసాద్ కుటుంబానికి విడివాడ రామచంద్ర రావు తన వంతు సాయంగా 5000 రూపాయలు, MPTC సుబ్బారావు 5000 రూపాయలు, రేల్లి పండు 5000 వేల రూపాయలు మొత్తం ఆ కుటుంబానికి అందజేశారు. అలాగే వరప్రసాద్ కుమారులకు చదువు నిమిత్తం అయ్యే ఖర్చు ఇస్తానని హామీ చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు మండలం అధ్యక్షులు చిక్కాల వేణు, పంతం నానాజీ, జవ్వాది ప్రసాదు, కొమరవరం జనసేనపార్టీ నాయకులు సురేష్, పండు,  జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  జనసేన వీరమహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం