అధికారమదం తో విర్రవీగడం సబబు కాదు… దీపికా కడారిపై స్టేషన్ లో ఫిర్యాదు

అధికారమదం తో విర్రవీగడం సబబు కాదు… దీపికా కడారిపై స్టేషన్ లో ఫిర్యాదు

                      దీపికా కడారి అనే మహిళ సోషల్ మీడియా లైవ్ ల ద్వారా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద మరియు మెగా ఫ్యామిలీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై పార్టీ నాయకులు మండపేట నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ గారిని సంప్రదించి జనసేన నాయకులు మరియు మెగాఫ్యామిలీ అభిమాన సంఘాల ఆధ్వర్యంలో మండపేట టౌన్ స్టేషన్ కు వెళ్లి ఎస్ ఐ తోట సునీత కు దీపికా కడారి పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. దీపికా కడారి అనే మహిళ చేసిన అనుచిత వ్యాఖ్యలకు మండపేట నియోజకవర్గం జనసైనికులు చాలాబాధకు గురి అవడంతో ఆమె పై చట్టరీత్య తగు చర్య తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ అధికార ప్రతినిధి శెట్టి రవి, చిరంజీవి ఫాన్స్ అధ్యక్షులు కొంతం నాగేంద్ర ప్రసాద్, పవన్ కళ్యాణ్ ఫాన్స్ అధ్యక్షులు గోళ్ళ శ్రీను, వరుణ్ తేజ్ ఫాన్స్ అధ్యక్షులు మోరం బాలాజీ, సత్తి శ్రీను, బొమ్మన సతీష్ తదితరులు పాల్గొన్నారు.

See also  కరుణ లేని కరోనా... చలనం లేని ప్రభుత్వం : ఎమ్మిగనూరు ఇంచార్జ్ రేఖా గౌడ్