పార్టీ సభ్యత్వ నమోదుకు సిద్ధంగా ఉండాలి : సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండల కార్యకర్తతో సమావేశం

పార్టీ సభ్యత్వ నమోదుకు సిద్ధంగా ఉండాలి : సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండల కార్యకర్తతో సమావేశం

              జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదుకు అందరూ సిద్ధంగా ఉండాలని జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు నియోజకవర్గ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వంపై బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో అవగాహన సమావేశం నిర్వహించారు. అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న నేపద్యంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండల కార్యకర్తలతో నిర్వహించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ కార్యకర్తలతో వరుసగా ఈ సమావేశాలను ఈరోజుతో పూర్తిచేశారు. ఈ కార్యక్రమంలో రాయి సునీల్, పసుపురెడ్డి సోమేశ్, హనుమంతు దిలిప్, దేవేంద్ర, బొడ్డేపల్లి వెంకటేష్, రాజేష్, శంకర్, లక్ష్మణ్, తిరుపతి, మణికంఠ, జగన్, అనంద్, అప్పన్న, వినయ్, గోవింద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

See also  నూజివీడు జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం