కాకరాపల్లి గ్రామ సమస్యలపై టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటన

కాకరాపల్లి గ్రామ సమస్యలపై టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటన

             జనసేన పార్టీ బలోపేతంలో భాగంగా సంతబొమ్మాళి మండలం కాకరాపల్లి గ్రామంలో ఈ రోజు టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటించి పలు గ్రామ సమస్యల్ని తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యంగా గ్రామానికి అనుకుని ఉన్న క్వారీ లో ఉపయోగించే బ్లాస్టింగ్ వలన తమ పంట పొలాలు, ఇంటి గోడలు దెబ్బతింటున్నాయని మరియు బ్లాస్టింగ్ శబ్దాల వలన రాత్రిపూట భయంతో గడపవలసి వస్తుందని గ్రామస్థులు తెలియజేసారు. ఇదే విషయాన్ని ఆ గ్రామ ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఉపయోగం లేకుండా పోయిందని కణితి కిరణ్ దగ్గర వాపోయారు. ఈ ఊరిలో ఉన్న తుఫాన్ రక్షిత భవనం శిథిలావస్థకు చేరుకున్నదని, గ్రామంలో ని కొందరు వారి సొంత అవసరాలకు తుఫాన్ భవనం ను వాడుకొంటున్నారని తెలియజేసారు. వెంటనే స్పందించిన కిరణ్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత పల్లి మల్లేష్, వెంకట్, శివ, సిమ్మన్న, మరియు జడ్పీటీసీ అభ్యర్థి చిన్నారెడ్డి, అనిల్ పొగటి, కొత్తూరు హరి, విరాట్ చందు, కల్కి, సాయి, తెలుగు శంకర్, సాయి మహంతి పాల్గొన్నారు.

See also  మార్కాపురం జిల్లా సాధనకై JAC ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి