మంగవరం లోజగనన్న ఇల్లు స్థలాల వద్ద నిరసన

మంగవరం

         పాయకరావుపేట ( జనస్వరం ) : పాయకరావుపేట మండలం మంగవరం గ్రామంనకు చెందిన జగనన్న కాలనీ జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి సూచన మేరకు గ్రామ జనసేన నాయకులు కట్టా దొర మరియు గ్రామ ఉప సర్పంచ్ దొడ్డిపట్ల శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఒక పక్క కొండ మరియొక పక్క చెరువు ఉన్న ప్రాంతాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించారు ఇది నివాశాలకు ఏమాత్రం పని చేయదు అందుచేత ఎవరూ ఇళ్ల నిర్మానానికి ముందుకు రాలేదు గ్రామానికి 3 కిలోమీటర్లు దూరంలో ఉంది. అలాగే అర్హులందరికీ కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి నివాశానికి పనికి వచ్చే చోట ఇవ్వాలని అలాగే అర్హులు అందరికి ఇవ్వాలి అని ఈ సందర్భంగా వారు కోరటం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసైనికులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

See also  వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాజోలు జనసేన నాయకులు