జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా బోయినపల్లి, నరసాపురం గ్రామాలలో పర్యటన

జనసేన ప్రజా పోరాట యాత్ర

            పత్తికొండ ( జనస్వరం ) : పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం నాయకులు నాయకల్ బాబ్జి, మధుసూదన్, ఆగిపోగు నాగరాజ్  ఆధ్వర్యంలో జనసేన ప్రజా పోరాట యాత్ర కొనసాగించడం జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ నరసాపురం గ్రామంలో కొన్నిచోట్ల గత అనేక సంవత్సరాల క్రితం అరకొర సిసి రోడ్డు నిర్మించినప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ అసలే లేదన్నారు. ఈ గ్రామంలో కొంతమంది వ్యక్తులు తన గుప్పెటలో పెట్టుకొని ప్రజలు ఏమైనా ప్రశ్నిస్తే వారికి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. చాలమంది వృద్ధులకు అర్హులైన వారికి ఫించన్లు అందట్లేదని తమ దృష్టికి తెస్తూ కన్నీటి పర్యంతమయ్యారన్నారు. బోయినపల్లి గ్రామంలో బిల్డింగుల్లో సిసి రోడ్డు అసలే లేదు. మిట్టమీద ఏరియాలో త్రాగునీటి సమస్య ఉందని చెప్పారు. ఇప్పటికైనా ఈ గ్రామాలలో అభివృద్ధి చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  జనసేన పార్టీ నాయకులు, నాగేశ్వరరావు, పులి శేఖర్, తిరుపాల్, గద్దల రాజు, కాశి ,మాలిక్ భాష, కళ్యాణ్, మద్దిలేటి, సుధీర్, కిరణ్, హరి తదితరులు పాల్గొన్నారు .

See also  పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల సైతాన్ వెల్లంపల్లి శ్రీనివాసరావు