రోడ్డు సమస్యపై బాబి నాయుడు ఆందోళన, స్పందించి పరిష్కరించిన అధికారులు

బాబి నాయుడు

                రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం మలికిపురం జనసేన నాయకులు బాబి నాయుడు మాట్లాడుతూ మలికిపురం నుంచి విశ్వేశ్వరపురం వేళ్ళే ప్రధాన రహదారి గుంత గుంతలుగా ఉన్నాయని జనసేన తరఫున గళాన్ని వినిపించి వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దానికి స్పందించిన అధికారులు రోడ్డు మరమత్తు పనులు మొదలుపెట్టారు.. స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు మొదలుపెట్టిన అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. అదేవిధంగా దీనికి శాశ్వత పరిష్కారం కూడా త్వరలోనే తీసుకొస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ఇది జనసేన విజయం అని ఒక జనసైనికుడిగా గర్వంగా చెబుతున్నాను. ప్రతి ఒక్క జనసేనకుడు మీ గళాన్ని బలంగా వినిపించి జనసేనాని ఆశయ సిద్ధాంతాలకు తోడుగా మన వంతు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 

See also  ఆముదాలవలస జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు