హిందూ దేవాలయాలపై దాడులను ఖండిస్తూ, సింహాచలం దేవస్థానం ఏఈ గారికి వినతి పత్రం అందజేత : జనసేన నాయకులు సందీప్ పంచకర్ల

హిందూ దేవాలయాలపై దాడులను ఖండిస్తూ, సింహాచలం దేవస్థానం ఏఈ గారికి వినతి పత్రం అందజేత : జనసేన నాయకులు సందీప్ పంచకర్ల

                    అంతర్వేది శ్రీ లక్ష్మినరసింహ స్వామీ దేవాలయంలో రథం దగ్ధమైన నేపథ్యంలో హిందూ ధార్మిక సంస్థలతో పాటు బిజెపి జనసేన నాయకుల పోలీసుల ఆంక్షలు మధ్య విశాఖలో సింహాచలం శ్రీ లక్ష్మినరసింహ స్వామీ దేవస్థానం తొలి మెట్టు వద్ద పూజా కార్యక్రమం చేపట్టి AEO గారికి వినతి పత్రం అందజేశాము. ఈ కార్యక్రమంలో భీమిలి జనసేన ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల గారు మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ,  హిందూ దేవాలయాలపై దాడులు జరగడం దురదృష్టకరమని పిఠాపురంలో జరిగిన దేవత మూర్తుల విగ్రహాల ధ్వంసం, కొండ బిట్రగుంట రథం దహణం , అంతర్వేదిలో  జరిగిన లక్ష్మీ నరసింహస్వామి రథం దహణం చూస్తుంటే కొన్ని దృష్టశక్తులు కావాలనే హిందువుల మనోభావాల దెబ్బతినేలా, విద్వేషాలు రెచ్చ కొట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సర్వమతాలను గౌరవిస్తారని, సంప్రదాయ, ఆచారాలకు విలువ ఇస్తారని వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా రిటైడ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని  ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, జనసైనికులు, హిందూ ధార్మిక సభ్యులు పాల్గొన్నారు. 

See also  ఇసుక అక్రమ తవ్వకాలపై నిరసన వ్యక్తం చేసిన జనసేన ఆత్మకూరు ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్