నీటి సమస్యను తీర్చాలని అధికారులను కోరుతున్న ఎచ్ఛర్ల జనసైనికులు

నీటి సమస్యను తీర్చాలని అధికారులను కోరుతున్న ఎచ్ఛర్ల జనసైనికులు

                      ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం కొత్త కుంకాం గ్రామపంచాయతీ నీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానిక జనసేన ఎంపీటీసీ అభ్యర్థి వడ్డేపల్లి శ్రీనివాస్ రావు తెలియచేశారు. ఈ సమస్యపై 24 గంటలు గడవకముందే జనసేన పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు స్పందించి మీడియాను పిలిపించి స్థానిక మహిళలతో “నీటి పై పోరాటం” చేయడం జరిగింది. ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లడానికి మా జనసేన పార్టీ తరఫున సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఈ గ్రామంలో మహిళలు నీటి కోసం పడుతున్నా నరకయాతన మీడియా ముఖంగా తెలియచేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించి జనసేన నాయకులు ఆ గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. నీటి సమస్య తీరే అంత వరకు జనసేన అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన ఎంపీటీసీ అభ్యర్థి వడ్డేపల్లి శ్రీనివాసరావు,రాంబాబు, విజయకృష్ణా, రాజు. జీ.సిగడాం మండల జడ్పిటిసి అభ్యర్థి భూపతి అర్జున్ రావు గారు, ఈ ఎచ్ఛర్ల మండలం జడ్పిటిసి అభ్యర్థి తమ్మినేని శ్రీనివాస్.రణస్థలం మండలం నాయకులు చిరంజీవి , అంజి బాబు, రెడ్డి భాస్కర్ ,రామారావు ,కృష్ణ. మధు బాబు, సంతోష్ స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు.

See also  కోవూరు నియోజకవర్గంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు