కనిగిరి నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయ సమావేశం

కనిగిరి

         కనిగిరి ( జనస్వరం ) : రేగులచేలుక శ్రీ లక్ష్మీ చెన్నకేశవ తిరునాళ్ళలో పాల్గొన్న ప్రకాశం జిల్లా కార్యదర్శి మరియు కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త యాలమందల రహిముళ్ళ జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం నిరంతరంగా కృషి చేయాలని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పామూరు మండల అధ్యక్షులు దర్శి ఏడుకొండలు, C.S పురం మండల అధ్యక్షులు జానపాటి రాజ, పామూరు మండల నాయకులు గుత్తి. మాహిత్, గుత్తి అఖిల్, ముత్తు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

See also  అభివృద్ధి చేయని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం