జనసేన పోరాటం… స్పందించిన ప్రభుత్వం…

జనసేన పోరాటం… స్పందించిన ప్రభుత్వం…

                   విజయవాడలోని గత కొన్ని నెలలుగా స్థానిక పాల ఫ్యాక్టరీ దగ్గర గల చనుమోలు వెంకటరావు ఫ్లైఓవర్ గుంతలు పడి అధ్వానంగా మారి ప్రయాణం చేయుటకు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు.  చాలా మంది యాక్సిడెంట్లో ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ సమస్యపై పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారపక్షంలోని నాయకులు గానీ ప్రభుత్వ అధికారులు గానీ  ఈ సమస్యపై స్పందించలేదు. ఈ సమస్యపై జనసేన నాయకులు శ్రీ పోతిన వెంకట మహేష్ గారు మరియు స్థానిక జనసేన కార్పొరేటర్ అభ్యర్థులు పలుసార్లు పోరాటాలు చేసి ఉన్నారు. దాని పర్యవసానంగా ఈరోజు అధికారులు ఫ్లై ఓవర్ బ్రిడ్జి మరమ్మతులు ప్రారంభించారు ఈ సమస్య పరిష్కారం కొరకు ఎంతగానో కృషిచేసి సమస్య పరిష్కారంకు అండగా నిలిచిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ పోతిన వెంకట మహేష్ గారికి మరియు స్థానిక 46వ డివిజన్ జనసేన కార్పోరేటర్  అభ్యర్థి శ్రీ షేక్ షర్మిల గారు మరియు అమీర్ భాషా దంపతులకు మరియు స్థానిక జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

See also  నడుకూరు గ్రామంలో పార్టీ బలోపేతంకు కృషి చేయాలని జనసైనికులకు హితువు