పవన్ కళ్యాణ్ గారి జన్మదిన దినోత్సవ సందర్భంగా మందులు పంపిణీ చేసిన మల్లాయి చిట్టూరు గ్రామ జనసైనికులు

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన దినోత్సవ సందర్భంగా మందులు పంపిణీ చేసిన మల్లాయి చిట్టూరు గ్రామ జనసైనికులు

           కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, ఘంటసాల మండలంలోని మల్లాయి చిట్టూరు గ్రామంలోని  జనసైనికులు, సెప్టెంబర్ 2 జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్బంగా, గ్రామం లోని ప్రజలు అందరికీ విటమిన్ -C మరియు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇవ్వటం జరిగింది.  ప్రస్తుతం కోవిద్ -19 వైరస్ వలన ప్రజలు బయపడుచున్న సందర్బంలో, కరోనా వైరస్ ను తట్టుకోవటానికి, మనిషిలోని ఇమ్మ్యూనిటి పవర్ తగ్గకుండా ఉండటం కోసం అందరికీ ఈ మందులు ఇవ్వటం జరిగింది. జనసైనికులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలలో భాగంగా అనవసరపు దుబారా ఖర్చులు పెట్టకుండా, పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి స్పూర్తితో యువత నడుము బిగించి ఒక మంచి కార్యక్రమం చెయ్యటం చాలా సంతోషంగా ఉన్నది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం కూడ చేయటం జరుగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఆవుల వేణు, గుత్తి శ్రీనివాస్, గుత్తి గణేష్, చింతల సురేష్, కొల్లు సుకుమార్, చింతల దానియేలు, గుత్తి శివ అవినాష్, పండ్రాజు అంకబాబు, నరహరశెట్టి గోపి, గుత్తి నవీన్, వీరమహిళలు గరికపాటి వైశాలి, ఆవుల లక్ష్మి పాల్గొన్నారు.

See also  పొదిలి గోపిని చంపిన హంతకులను అరెస్టు చేయాలని జనసేన ఆధ్వర్యంలో పాదయాతర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి