
ద్వారంపూడి జనసైనికుల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, కరోనా కిట్లు పంపిణీ
పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పారిశుద్య కార్మికులకు బియ్యం, టవల్స్ మరియు శానిటైజర్ కిట్లు పంపిణీ చేశారు ద్వారంపూడి జనసైనికులు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ద్వారపూడి జనసేన నాయకులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, శ్రీ చిక్కాల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. ముఖ్య అధితిగా మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ గారు విచ్చేసి కేక్ కట్ చేసి, నిరుపేదలకు పారిశుద్య కార్మికులకు బియ్యం, టవల్స్ మరియు శానిటైజర్ కిట్లు పంపిణీ చేశారు.








