అనంత సాగరం మండలంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

            ఆత్మకూరు ( జనస్వరం ) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131 వ జయంతి సందర్భంగా అనంత సాగరం మండలం బద్వేల్ రోడ్డు సెంటర్ వద్ద ఆ మహనీయుని విగ్రహానికి ఘననివాళులు అర్పిస్తూ, అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఆయన ఆశయ సాధన కోసం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం జన సేన పార్టీ తరపున కృషి చేస్తానని తెలియజేశారు. మరొకసారి ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరపు నుంచి ఘనంగా అంబేద్కర్ గారి జయంతి స్మరించుకున్నారు. ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ గారు మరియు అనంతసాగరం మండలం జన సేన పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సైఫుల్లా, మండల కార్యదర్శి,ఎం. పెంచలయ్య, ప్రసాద్ మహ్మద్ రఫీ, వహీద్, రసూల్ పాల్గొనడం.

See also  చేనేత సమస్యల సాధన కోసం కృషిచేస్తాం :- జనసేనపార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్