యస్. కోటలో జనసేనపార్టీలోకి చేరికలు

జనసేనపార్టీ

         విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ నియోజకవర్గ నేత వబ్బిన సత్తిబాబు గారి ఆధ్వర్యంలో వ్యవసాయ సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, కళ్లేపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గోకాడ సన్యాసయ్య, కొత్తవలసకు చెందిన రామదాసు కాశీ జనసేన పార్టీలో చేరారు. జనసేనపార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరినట్టు వారు తెలిపారు. సన్యాసయ్య గారి చేరికకు కృషి చేసిన వీర మహిళ వెంకట లక్ష్మిని పార్టీ నాయకులు అభినందించారు. ఐకమత్యంతో పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో వేపాడ, ఎల్.కోట, ఎస్.కోట, కొత్తవలసకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

See also  వేమూరు నియోజకవర్గంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి