సింగవరం గ్రామంలో జనసేనపార్టీ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి

    సింగవరం, (జనస్వరం) : విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం, సింగవరం గ్రామంలో మొట్ట మొదటిసారిగా గ్రామ జనసైనికులు అందరూ పవన్ కళ్యాణ్ గారిపై విశ్వాసంతో గ్రామంలో జనసేనపార్టీ జెండాను విజయనగరం నియోజకవర్గం ఇంచార్జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో జనసైనికులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు భారీ ఎత్తున వచ్చి, సింగవరం జనసైనికులకు అండగా నిలిచి కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు.

See also  జగనన్న కాలనీలు పెద్ద స్కామ్ లా మారాయి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి