
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 50వ పుట్టినరోజు పురస్కరించుకొని కువైట్ లో ఉన్న జనసేన NRI సేవా సమితి కువైట్ సభ్యులు ఆగస్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు 30 రోజులు 30 ప్రాంతాలలో 30 సేవా కార్యక్రమాలు చేపడుతూ నిరుపేదలకు వైద్య విద్య, స్వయం ఉపాధి పలు సహాయాలు చేయడం ప్రారంభించారు. మూడవ కార్యక్రమంగా కడప జిల్లా చిట్వేలు మండలం కేస్ అగ్రహారం హరిజన వాడలో 50 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర పంపిణీని జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్, జనరల్ సెక్రటరీ అయిన శ్రీ దండు చంద్రశేఖర్ వారి నాన్న దండు వెంకటేష్ గారి జ్ఞాపకార్థంతో ఈ సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేస్ అగ్రహారం మాజీ వైస్ సర్పంచ్ దండు రమేష్ చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. అలాగే ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు రెడ్డి ప్రసాద్, సింగిరి శివమ్మ, కుప్పాల జ్యోతి, మాధవి యువ నాయకులు నగిరి పాటి మహేష్ దాసరి వీరు వెంకీ, మహేష్ దండు రామ్ మోహన్ మస్తానయ్య, దండు రమణ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.








