జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి : జనసేన వీరమహిళ పాలవలస యశస్వి

జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా బలంగా తీసుకెళ్ళండి : జనసేన వీరమహిళ పాలవలస యశస్వి

                విజయనగరం 27 వ డివిజన్ జనసేన కార్పొరేట్ అభ్యర్థిని లోపింటి రామలక్ష్మి గారి ఇంటివద్ద జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్ సమావేశానికి ముఖ్వఅతిథి గా విజయనగరం జనసేన ఇంచార్జ్, జనసేన రాష్ట్ర పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యురాలు శ్రీ మతి పాలవలస యశస్వి గారు పాల్గొన్నారు.యశస్వి గారు మాట్లాడుతూ జనసేన ను వార్డు స్తాయి నుంచి బలోపేతం చేయాలని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలకు ఏ సమస్య వచ్చిన జనసేన ముందు ఉంటుందని,స్థా నికంగా నిలబడ్డ కార్పొరేట్ అభ్యర్థిని లోపింటి రామలక్ష్మి గారిని గెలిపించాలని కోరారు. 27 వ డివిజన్ ప్రజల సమస్యల పై జనసైనికులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత అద్యక్షులు అంజనీపుత్ర చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపకుడు త్యాడ రామక్రిష్ణ రావు(బాలు) పాల్గొన్నారు. బాలు మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మే ప్రసక్తే లేదని, ఇప్పుడు ప్రజల కు ఏ సమస్య వచ్చిన జనసేన ఒక్కటే గుర్తు వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమం 27 వ డివిజన్ జనసైనికుడు లోపింటి కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో భాగంగా విజయనగరం జనసేన సీనియర్ నాయకులు రవితేజ గారు, రాజేష్ గారు, సతీష్ గారు, యోగేష్ గారు, ప్రసాద్ గారు, 27 వ డివిజన్ మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

 

See also  ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : అనంతపురం జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు టి.సి వరుణ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి