చీపురుపల్లి నియోజకవర్గంలో జనవాణి – జన చైతన్య యాత్ర

చీపురుపల్లి

      చీపురుపల్లి ( జనస్వరం ) : జనవాణి – జన చైతన్య యాత్ర అనే పేరుతో ప్రజల్లోకి జన సైనికులు వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు చీపురుపల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడిలో పూజా కార్యక్రమము నిర్వహించారు. తదుపరి నియోకవర్గస్థాయిలో ఉన్న జన సైనికులు, నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కలసి 2024లో  పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకొన్నారు. ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను, కరపత్రాలను పంచడం జరిగింది. రానున్న రోజుల్లో నియోజకవర్గ౦ మొత్తం కార్యక్రమాన్ని తీసుకెళ్లి జనసేనపార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రౌతు కృష్ణవేణి, పెద్ది వెంకటేష్, ఎడ్ల. సంతోష్, బోడసింగి రామకృష్ణ, అప్పలనాయుడు, దన్నాన యేసు, గోళ్లబాబు, సత్య, కిషోర్, చందక బాల, జగదీశ్, బంటుపల్లి శంకర్, బాకూరి శ్రీను, ధనుంజయ, లెంక జగదీశ్, వినోద్ కుమార్, సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. 

See also  గరుడ వారధి పొడిగింపులో మీ వాటా ఎంత? అని వైసీపీ ని ప్రశ్నించిన తిరుపతి జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి