
జనసేనాని జన్మదిన సందర్భంగా యాచకులకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ చేసిన జనసైనికులు
జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం పరిసరాల్లో నివాసం లేని దేవాలయలు దగ్గర నివసిస్తున్న ఓ 50 మంది బిచ్చగాళ్లకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగన్నాథపురం జన సైనికులు అందరూ కలిసి వాళ్ళకి మద్యాహ్నం ఆహారం ఇవ్వటం జరిగింది. రానున్నది వర్ష కాలం కావటంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని గ్రహించి వాళ్ళకి దుప్పట్లు పంపిణి చేయటం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జగన్నాథపురం జనసైనికులు అందురు పాల్గొన్నారు.









