ఆదోనిలో రామ్ చరణ్ అభిమానులు, జనసైనికుల ఆధ్వర్యంలో థియేటర్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణి

ఆదోనిలో రామ్ చరణ్ అభిమానులు, జనసైనికుల ఆధ్వర్యంలో థియేటర్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ 

         కర్నూల్ జిల్లా ఆదోని నియోజకవర్గ రామ్ చరణ్ యువ శక్తి, జనసైనికుల  తరుపున మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ రోజు ఆదోని నియోజకవర్గ సినిమా థియేటర్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కపీలేశ్వరయ్య గారు మరియు బీజేపీ రాష్ట్ర సెక్రెటరీ శ్రీ కునిగిరి నీలకంఠ గారు పాల్గొన్నారు. వారు  మాట్లాడుతూ సినిమా థియేటర్ కార్మికులకు లేబర్ కార్డ్స్ లేని వారికి కార్డులు వచ్చేలా, లేబర్ కార్డు ఉన్న కూడా వారికీ వేతనాలు వచ్చేలా చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే అసంఘటిత కార్మికులకు గుర్తింపు లభించే విధంగా త్వరలోనే దీనికి సంబంధించిన అధికారులను ఆదోని పిలిపించి వీరందరికీ గుర్తింపు లభించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని రాష్ట్ర రాంచరణ్ యువశక్తి సభ్యులు నాగేష్, చిన్న, అన్వార్, గోపాల్, గౌతమ్, మహేష్ శివరాం జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కునిగిరి నీలకంఠ గారికి ప్రత్యేక హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

See also  ప్రపంచ ఆర్థికాభివృద్ధి కేంద్రంగా భారత్‌.. అదే మా లక్ష్యం ప్రధాని మోదీ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి