జనసేనపార్టీ బలోపేతమే లక్ష్యం : పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయం : జనసేన నాయకులు యుగంధర్ పొన్నాల

జనసేనపార్టీ

      పాలసముద్రం, (జనస్వరం) : పాలసముద్రం మండల కేంద్రంలో జనసేనపార్టీ మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేనపార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్నాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని, ఈ రాష్ట్రంలో జనరంజకమైన పాలనను జరగాలంటే పవన్ కళ్యాణ్  గారిని  ముఖ్యమంత్రి చేయాలని లేదంటే ఇంకా అరాచకం ఇంకా దౌర్జన్యం ఇంకా దిగ జారిపోయే ప్రమాదం ఉందని ఎద్దేవా చేశారు. 2023 జమిలి ఎలక్షన్ అయినా, 2024 జనరల్ ఎలక్షన్ లో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే అని తెలిపారు. కాబట్టి జగన్ పోవాలి, పవన్ రావాలి అంటే యువశక్తి రాజకీయ శక్తిగా మారాలని తెలియజేశారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లతీష్, నియోజకవర్గం సమన్వయ కర్త రూపేష్ రాజు, జనసేన నాయకులు రమేష్ మదన్, రఘు, యువరాజ్, తలారి రుద్ర, కేశవ్, లోకేష్, కుమార్, రేణు ప్రసాద్, సుధాకర్, ఢిల్లీ బాబు, జానకిరామ్, తులసి మరియు తదితురులు పాల్గొన్నారు.

See also  వడిశలేరు గ్రామంలో ఇంటింటికి జనసేన కార్యక్రమం