అర్హులైన రైతులకు రైతు భరోసా సొమ్ము జమ కావడం లేదు తక్షణమే అర్హుల జాబితాలో చేర్చాలని నర్సీపట్నం జనసేన నాయకులు డిమాండ్.

నర్సీపట్నం

   నర్సీపట్నం, (జనస్వరం) : జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయకర్త రాజనా వీర సూర్య చంద్ర సమక్షంలో మల్లాడి శ్రీను, బైన మురళి ఆధ్వర్యంలో నాతవరం మండలం రైతు భరోసా కేంద్రం వద్ద ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సూర్య చంద్ర మాట్లాడుతూ పీఎం కిసాన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి రైతు భరోసా అర్హుల జాబితాలో కొత్తగా రైతు పాసుపుస్తకాల చేసుకున్నటువంటి రైతులు ఇబ్బంది గురవుతున్నారని గడిచిన ఆరు నెలలుగా వాలంటీర్, సచివాలయాలు, మండల వ్యవసాయ శాఖ అధికారి చుట్టూ తిరిగినా సరే రైతు భరోసా డబ్బులు జమ కావడం లేదంటూ అర్హుల జాబితాలో మా పేర్లు ఉండటం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. రైతుల పక్షాన పోరాటం చేస్తుందని, మండల వ్యవసాయ శాఖ అధికారి గారి వద్దకు వెళ్తే, ఆమె సమయంకు ఆఫీసుకు రావటం లేదు సరి కదా అక్కడ ఉన్న ఉద్యోగులు సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని, రైతులు పెట్టిన పెట్టుబడి సాయం కింద ప్రభుత్వాలు ఇస్తా ఉంటే క్రింది స్థాయి ఉద్యోగులు మాత్రం అనర్హులను, అర్హులుగా చేసే క్రమంలో రైతులకు అన్యాయం చేస్తున్నారని, కొత్తగా భూమి కొనుక్కున్న వారైనా, తల్లిదండ్రుల ఆస్తి నుంచి వచ్చిన వారైనా, గిఫ్ట్ గా తీసుకున్న వారైనా సరే వీరందరూ కూడా పెట్టుబడి సాయం కింద వచ్చే డబ్బులు కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్న, గడిచిన ఆరు నెలలుగా పని జరగడం లేదంటూన్నారు. జనసేన పార్టీ మద్దతుతో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తక్షణమే అధికారులు స్పందించి అర్హులైన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అర్హుల జాబితాలో చేరే విధంగా ప్రయత్నించాలి. అలా చేయని పక్షంలో జిల్లా కలెక్టర్ గారికి మరియు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును ఆశ్రయిస్తాం అంటూ రైతుల తరపున జనసేన పార్టీ నాయకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు తదితురులు  పాల్గొన్నారు.

See also  విజయనగరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి