లివర్ సమస్యతో బాధపడుతున్న అంగర శ్రీనుకు రూ.13500 ఆర్థిక సాయం అందించిన జనసైనికులు

లివర్ సమస్యతో బాధపడుతున్న అంగర శ్రీనుకు రూ.13500 ఆర్థిక సాయం అందించిన జనసైనికులు       ఈ కరోనా విపత్కర సమయంలో  నిత్యం ఏదో ఒక మూల జనసేన పార్టీ జనసేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.  లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ జనసేనాని పవన్ కళ్యాణ్  స్ఫూర్తితో తమవంతు సాయం చేస్తున్నారు. వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉన్న వారికి సైతం పార్టీలకు అతీతంగా జనసైనికులు అండగా నిలబడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పరిధిలోని కాళ్ల మండలం, బొండాడ గ్రామానికి చెందిన అంగర శ్రీను అనే లారీ డ్రైవర్ కొంత కాలంగా లివర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బొండాడ గ్రామానికి చెందిన జనసైనికుడు నిమ్మల రాఘవ(యమహా) వారి కుటుంబానికి పార్టీ తరఫున ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించారు. ఈమేరకు విషయాన్ని కాళ్ల మండల జనసైనికులకు తెలియ చేశారు. అంతా కలసి రూ.13,500 సమీకరించి బాధితునికి అందచేశారు. జనసైనికుల ఔధార్యానికి బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. జనసైనికులను సేవా మార్గం వైపు నడిపిస్తున్న పవన్ కల్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు. జనసైనికుడు నిమ్మల రాఘవ మాట్లాడుతూ జనసేనాని ఆశయ సాధనలో భాగంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. 

See also  బీడీ కార్మికుల జీవితాల్లో మార్పులు తెస్తాం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి